ప్రముఖ సింగర్ స్మిత… మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. మోడీ పరిపాలన సంతృప్తిగా లేదని పేర్కొంది. తాజాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన స్మిత బీజేపీ ప్రభుత్వం పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సమాజంలో కులం యొక్క ప్రభావం చాలా గట్టిగా ఉంది అని ఎవరైనా మాట్లాడితే నీ కులం ఏంటి అని తెలుసుకున్న తర్వాతే వేరొకటి మాట్లాడుతున్నారని, కానీ నాకు మాత్రం కులం అనే విషయం గురించి డిగ్రీ చదివేంత వరకు తెలియదు అంటూ చెప్పుకొచ్చింది.
ఇక రాజకీయాల గురించి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎవరికి మద్దతు ఇవ్వాలి అనే విషయంలో మాత్రం అప్పుడు ఉండే పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. పాలిటిక్స్ లోకి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదని, ఒకవేళ వెళ్లినా స్వేచ్ఛగా నిర్ణయాలు చెప్పే పరిస్థితి ప్రస్తుత రోజుల్లో ఏ పార్టీలో లేదని తెలిపింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళటం ఇష్టం లేదాని సింగర్ స్మిత క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉండగా గత ఎన్నికల సమయంలో మోడీకి మద్దతు అనవసరంగా ఇచ్చాను అని షాకింగ్ కామెంట్ చేసింది. మోడీ పరిపాలన అనుకున్నట్టు ఏమీ లేదని, ఆయన పరిపాలన పై పెట్టుకున్న అంచనాలను ఏ మాత్రం ఆయన అందుకోలేకపోయారు అన్నట్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. గతంలో నరేంద్ర మోడీకి అనుకూలంగా స్మిత ఆల్బమ్ చేయడం జరిగింది. అటువంటి స్మిత ఈ రీతిగా కామెంట్లు చేయటంతో ఒక్కసారిగా మోడీపై స్మిత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?