తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో బిజెపి పార్టీ సత్తా చాటడానికి అన్ని విధాలా రెడీ అవుతుంది. ఎలాగైనా జరగబోయే గ్రేటర్ హైదరాబాద్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని తెలంగాణ బిజెపి ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలను నాయకులను ఏకం చేస్తూ ముందుకు సాగుతుంది. ఇటువంటి తరుణంలో కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ పార్టీ ని గట్టిగా టార్గెట్ చేసి ప్రతి చోట బూత్ కమిటీ డివిజన్ కమిటీ అధ్యక్షులు కార్యకర్తలను ఏకం చేసి పార్టీని ముందుకు నడిపించాలని ఆదేశించారు.
ఎక్కడికక్కడ వర్చువల్ మీటింగులు పెట్టుకుంటూ మరోపక్క ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించండి అని అన్నారు. అదేవిధంగా కరుణ వంటి కష్టకాలంలో కేంద్ర ఆత్మ నిర్భర్ ప్యాకేజీ అమలు తీరుపై ప్రజలకు తెలియజేయండి అని చెప్పుకొచ్చారు. ఇక హైదరాబాద్ లో లక్ష మంది స్ట్రీట్ వెండర్స్ కు ఒక్కొక్కరికీ పీఎం పథకం కింద పదివేల రుణం సాయం చేయడం జరిగిందని తెలిపారు. జరగబోయే ఎన్నికలలో అందరూ కలసి కట్టుగా పని చేస్తేనే విజయం సాధిస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
అదేవిధంగా స్థానిక సమస్యలు, డబుల్ బెడ్ రూమ్ వరదలు మాన్యువల్స్ ప్రమాదాలు వంటి ప్రభుత్వ వైఫల్యాలను చాలా గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లి సోషల్ మీడియా ద్వారా ప్రచారం సూచించారు. తెలంగాణలో బిజెపి స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి టిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ ని పక్కనపెట్టి బిజెపినే టార్గెట్ చేశారని… కాబట్టి ప్రతి ఒక్కరూ కలసికట్టుగా జరగబోయే ఎన్నికలలో బిజెపి ని గెలిపించడానికి అన్ని విధాలా కృషి చేయాలని కిషన్ రెడ్డి సూచించారు. ఏది ఏమైనా జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలని చూస్తున్న కేసీఆర్ ని జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో గట్టిగానే దెబ్బ కొట్టడానికి బిజెపి నేతలు సమాయత్తమవుతున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?