మహమ్మారి కరోనా వైరస్ భయం తో లాక్ డౌన్ సమయం లో భయాందోళనతో ఉన్న ప్రజలను సైబర్ నేరగాళ్లు రకరకాలుగా దోచుకున్న ఘటనలు ఎన్నో బయటపడ్డాయి. ఇదే విషయాన్ని ఇటీవల ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ ఏడాది త్రైమాసికంలో ఫిషింగ్ వెబ్సైట్ల డూప్లికేట్ లో 350 శాతం పెరిగినట్లు గుర్తించింది.కరోనా భయాన్ని లక్ష్యంగా చేసుకుని ఆసుపత్రులు మరియు వైద్య రంగాన్ని టార్గెట్ గా చేసుకుని సైబర్ నేరగాళ్లు ప్రపంచవ్యాప్తంగా పెచ్చుమీరుతున్నరని సైబర్ నేరగాళ్ల తో పాటు ఉగ్రవాద కార్యకలాపాలు కూడా చాప కింద నీరులా కరోనా కష్టకాలంలో విస్తృతం చేశారని ఐక్యరాజ్యసమితి గుర్తించింది.
మహమ్మారి కరోనా కారణంగా ప్రజలంతా ఎక్కువగా సోషల్ మీడియా లోనే గడుపుతున్న నేపథ్యంలో…. కొన్ని రాడికల్ టెర్రరిస్ట్ గ్రూపు సంస్థలు నిధులు సమకూర్చుకుని ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ప్రపంచ దేశాలు కరోనా కట్టడి పై దృష్టిసారించిన టైములో ప్రపంచ శాంతి భద్రత వ్యవస్థీకృత నేరాలు, అదేవిధంగా టెర్రరిజం ఎలాంటి ప్రభావం భవిష్యత్తులో చూపిస్తుందో అనే దానిపై స్పష్టంగా ఓ అంచనా ఇప్పుడే ఏమాత్రం చెప్పలేమని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.
కాబట్టి ప్రపంచ దేశాలు ఒకపక్క కరోనాపై పోరాడుతూనే, మరోపక్క ఉగ్రవాదులతో పాటు సైబర్ నేరగాళ్లతో కూడా పోరాడే విధంగా ప్రభుత్వాలు అలర్ట్ గా ఉండాలని విజ్ఞప్తి చేసింది. మొత్తానికి కరోనా టైములో జనాలంతా ఇళ్ళల్లో ఉండటంతో ప్రపంచంలో వైరస్ విస్తరిస్తే సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాదం, సైబర్ నేరాలు విస్తరించినట్లు ఐక్యరాజ్య సమితి షాకింగ్ కామెంట్లు చేసింది.