YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పదవిని అధిరోహించిన సమయంలో అనుభవం లేదు.. రాష్ట్ర ప్రజలకి అనేక ఇబ్బందులు ఎదురవడం గ్యారెంటీ అని జగన్ ప్రత్యర్థులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. సీన్ కట్ చేస్తే జగన్ ముఖ్యమంత్రి అయి పది నెలలు సాధారణంగా ఉన్న ఆ తర్వాత మహమ్మారి కరోనా రాకతో మొత్తం వ్యవస్థలు స్తంభించడం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచం ఎన్నడు ఎదుర్కొని రీతిలో కరోనా రూపంలో శత్రువుని ప్రభుత్వాలు ఎదుర్కొనగా.. ఈ మహమ్మారిని కంట్రోల్ చేయటం పాలకులకు తలనొప్పిగా మారింది. అయితే అనుభవం లేదని అప్పట్లో జగన్ ప్రత్యర్థులు విమర్శించగా.. ఈ కరోనా విషయంలో భారత ప్రభుత్వ పెద్దలు.. దేశవ్యాప్తంగా ఎక్కువగా అమలు చేసిన ఐడియాలు చూస్తే ఏపీలో వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలే అని చెప్పవచ్చు.
మహమ్మారి తీవ్రత బట్టి రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లు విభజించడం.. ఇంకా వ్యాక్సిన్ విషయంలో జగన్ ఇచ్చిన సూచనలు ప్రధాని తీసుకోవటం ఇలా రకరకాలుగా చాలావరకు ఏపీలో జగన్ అమలు చేసిన నిర్ణయాలు ఢిల్లీలో కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేయడం జరిగింది. ఇక ఇదే తరుణంలో ఏపీలో సంక్షేమ పథకాలు అందిస్తూ పలు రాష్ట్రాలకు కూడా వైయస్ జగన్ ఒక మార్గదర్శిగా కనబడటం జరిగింది. విద్యావ్యవస్థలో జగన్ ఏపీలో తీసుకున్న నిర్ణయాలే ఢిల్లీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రంలో ఏపీ విద్యావిధానాలు సంక్షేమ పథకాలు అందించాలని.. ముఖ్యంగా “నాడు నేడు” వంటి కార్యక్రమాలు ద్వారా ఢిల్లీ స్కూల్స్ లో అనేక మార్పులు చేయాలని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అప్పట్లో ఆలోచన చేసినట్లు వార్తలు రావడం తెలిసిందే.
Read More: AP CM YS Jagan: జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్..!!
ఇక ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని కూడా కేజ్రీవాల్ ప్రభుత్వం తో పాటు బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా అమలు చేయాలని అనుకున్నట్లు అప్పట్లో జాతీయ స్థాయిలో వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన పరంగా ప్రధాన పాత్ర పోషిస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థ.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని డిసైడ్ అయినట్లు ఇప్పటికే జీవో కూడా జారీ చేసినట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలు అనేక కార్యక్రమాలు నేరుగా లబ్ధిదారుల చెంతకు చేరుకోవడం మాత్రమే కాక ప్రజల సమస్యలు.. తక్కువ టైం లో తీరి పోవడం, ఏటువంటి ప్రజా ప్రతినిధి చుట్టూ తిరగకుండా.. ప్రజల సమయం పాడవకుండా గ్రామ సచివాలయ వ్యవస్థ పనిచేస్తుంది. ఇప్పుడిదే వ్యవస్థను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని.. జగన్ పాలనను కాపీ కొట్టే రీతిలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఎపీలో సచివాలయం అనే పేరు కి బదులుగా..యూపీలో “ఉత్తర్ ప్రదేశ్ గ్రామా పంచాయత్” అనే పేరు యోగి పెట్టడానికి డిసైడ్ అయ్యారు. ఈ న్యూస్ ఇప్పుడు నేషనల్ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలో యూపీలో ఎన్నికలు..ఇలాంటి సమయంలో జగన్ ఐడియాలు బీజేపీ ఫాలో అవ్వడం సేన్ సెషన్ గా మారింది.