Corona : దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్న కొద్ది పెరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా గానీ పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో బయట పడుతున్న తరుణంలో కేంద్రంలో అదేవిధంగా కేసులు ఎక్కువ బయట పడుతున్న రాష్ట్రాలలో టెన్షన్ నెలకొంది. దీంతో ఇప్పటికే కేంద్ర ఉన్నత వైద్య బృందాలు ఆయా రాష్ట్రాలలో దింపి కరోనా ని అరికట్టడానికి సరికొత్త వ్యూహాలతో ముందడుగు వేస్తూ కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తూనే ఉన్నాయి. అంతమాత్రమే కాకుండా కరోనా ఆంక్షలను మరింత కఠినతరం చేస్తూ ఉన్నాయి.
ఇలాంటి తరుణంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కరోనా విషయంలో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేటర్ లోకి వెళితే మహారాష్ట్ర అదేవిధంగా కేరళ ప్రాంతాల నుండి వచ్చేవారిని తప్పనిసరిగా టెస్టులు చేసి రాష్ట్రంలో అడుగుపెట్టే రీతిలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైలు మరియు రోడ్డు అదేవిధంగా విమాన మార్గాల ద్వారా వచ్చేవారిని తప్పనిసరిగా పరీక్షించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలో పాజిటివ్ వస్తే వెంటనే హోమ్ క్వారంటైన్ లో ఉంచాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
చాలా వరకు ఉత్తర ప్రదేశ్ చుట్టుప్రక్కల రాష్ట్రాలలో పాజిటివ్ కేసులు భయంకరంగా బయట పడుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోపక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే రీతిలో టెస్టులు నిర్వహిస్తూ ఉంది. పక్కనే మహారాష్ట్ర ఉండటంతో..తెలంగాణ మహారాష్ట్ర కి దగ్గరగా ఉండే జిల్లాలలో ఇప్పటికే కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచుతూ ఎక్కడికక్కడ వైరస్ ను కట్టడి చేయటానికి సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తుంది.