మాజీమంత్రి రైతు నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అనే పుస్తకాన్ని రచించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. జరిగిన ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం నేత మధు, సుంకర రాజేంద్ర ప్రసాద్, వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
అంతేకాకుండా ఆన్లైన్ లో బెంగళూరు నుండి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వెంకట గోపాల గౌడ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇదిలా ఉండగా పుస్తక రచయిత వడ్డే… ఈ పుస్తకాన్ని రాజధాని కోసం భూములను త్యాగాలు చేసిన రైతులకు అంకితం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
“పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాది ఎవరు” అనే ఈ పుస్తకం లో అమరావతి రాజధానిగా గుర్తించడం, ఆ సమయంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నాయకుల రాజకీయ ప్రకటనల ప్రస్తావన, అమరావతి నుంచి రాజధాని తరలింపు, జగన్ ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు, అధికారం కోల్పోయిన నారా చంద్రబాబు వంటి తదితర అంశాలను పుస్తకంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రస్తావించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?