Vallabhaneni Vamsi : గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పై సెటైర్లు వేశారు. మనిషి మానసికంగా దెబ్బ తిన్నాడు అంటూ చంద్రబాబు పై విమర్శల వర్షం కురిపించారు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత వయసు రీత్యా గాని ఎన్నికలలో జగన్ అతిపెద్ద విజయం సాధించటం చంద్రబాబు ఊహించని పరిణామమని..కాబట్టి ఆయన మానసికంగా చాలా దెబ్బతిన్నాడు అని పేర్కొన్నారు.
దీంతో చంద్రబాబు ఊహాలోకంలో బతుకుతూ… జనాల్లోకి వచ్చి నేనే ముఖ్యమంత్రి, మళ్లీ ఇంటి లోకి వెళ్లి నా కత్తి, డాలు ఎక్కడ అంటూ అరిచే పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 వేల పంచాయతీలు అమరావతిలో 29 పంచాయతీలు. అటువంటి అమరావతిని లక్షన్నర కోట్లు పెట్టి అభివృద్ధి చేయాలని చంద్రబాబు అనటం..అంటే మిగతా ప్రాంతాలను ఎడారి చేయడమేనా అని వంశీ ప్రశ్నించారు.
గత ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా గెలిచారు అని విమర్శించారు, మరి ఇప్పుడు పేపర్ బ్యాలెట్ విధానం ద్వారా ప్రజలు అదిరిపోయే రీతిలో తీర్పు ఇచ్చారని చంద్రబాబు అందువల్లే మాట్లాడటం లేదని వల్లభనేని వంశీ తెలిపారు. గతంలో ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికలలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు గెలిచిన గాని తమ వల్లే గెలిచినట్లు అర్థం పర్థం లేని విమర్శలు చేశారు. ఇప్పుడు పేపర్ బ్యాలెట్ విధానం ద్వారా పార్టీ గుర్తు పై జరిగిన ఎన్నికలలో.. ప్రజలు ఇచ్చిన తీర్పు చంద్రబాబు నోటి నుంచి మాట రావడం లేదు అన్నట్టు వంశీ భారీ స్థాయిలో కౌంటర్లు వేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?