కరోనా వైరస్ వ్యాప్తి వలన అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విమాన రాకపోకల పై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి వందే భారత్ మిషన్ పేరిట అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఐదో దశలో సాగుతున్న ఈ అంతర్జాతీయ విమాన సర్వీసులు స్వదేశానికి ఇప్పటి వరకూ పది లక్షల మంది భారతీయులను తీసుకొచ్చినట్లు పౌరవిమానయాన శాఖ హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. మే 7 స్టార్ట్ అయిన ఫేజ్ 5 వందే భారత్ మిషన్ సర్వీసులు…. ఈ నెల 31 వరకు కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఫేజ్ లో దాదాపు 53 దేశాల నుండి 700 ప్రమాణాల ద్వారా మరో లక్ష ఇరవై వేల మందిని స్వదేశానికి తీసుకు రాబోతున్నారు. అవసరమైతే మరో పది లక్షల మందిని తీసుకు రావటానికి కూడా వందే భారత్ మిషన్ సర్వీసులు త్వరలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.