2019 ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఒక పద్ధతి ప్రకారం పరిపాలన చేస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తుంది. మొదటి ఏడాది మొత్తం ఎక్కడా కూడా ప్రతిపక్షాలను టచ్ చేయకుండా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, హామీని నెరవేరుస్తూ ప్రజా సంక్షేమాన్ని అమలు చేస్తూ సక్సెస్ సీఎం గా పేరు సంపాదించారు. ఇక రెండో ఏడాది మొదలయ్యాక గత ప్రభుత్వం చంద్రబాబు హయాంలో జరిగిన ప్రతి అవినీతిని వెలికి తీసే పని వైసీపీ స్టార్ట్ చేసిందని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ముందుగా ESI స్కాం అంటూ మాజీ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ని జైలుకు పంపించడం జరిగింది. ఆ తరువాత నకిలీ పత్రాలతో లైసెన్స్ లేని వాహనాలతో ట్రావెలింగ్ వ్యాపారం చేస్తున్న టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ని వైసీపీ ప్రభుత్వం జైలుకు పంపించడం మనకందరికీ తెలిసిందే.
దీంతో ఇప్పటికే నెక్స్ట్ ఎవరు అనే ప్రశ్న చంద్రబాబు టైం లో పని చేసిన మంత్రుల గుండెల్లో గుబులు ఉన్న టైంలో విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో పెద్ద బాంబు పేల్చినటు అయింది. తాజాగా విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో చంద్రబాబు హయాంలో పెద్ద కుంభకోణం జరిగిందంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ కుంభకోణంలో మాజీ మంత్రి ఉన్నాడంటూ ఆయన పరోక్షంగా ఆరోపించారు. 12 కోట్ల రూపాయల విలువైన సైకిల్ కుంభకోణం జరిగిందని లీకులు తరహాలో వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ చూస్తే…‘తుప్పు సైకిళ్ళపై గంటా శీను గణగణా..! 12 కోట్ల కొనుగోళ్ళలో 5 కోట్ల అవినీతి! ఎస్ కే బైక్స్ నుంచి కొనవద్దని బ్లాక్ లిస్టు చేసినా.. బ్లాక్ మనీ కోసం తెగ తొక్కేశాడని ఫిర్యాదుల వెల్లువ..!’’అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
ఇదే టైములో వంద ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి మళ్లీ ప్రభుత్వానికే అమ్మేసిన అతిపెద్ద కుంభకోణం స్కాం కూడా త్వరలో అన్ని వివరాలతో సదరు టీడీపీ నాయకుడు పేరుతో త్వరలో ప్రపంచానికి పరిచయం చేయబోతున్నట్టు విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో వివరించారు. అంతేకాకుండా ఈ ఏడాది మొత్తం ప్రపంచమంతా “కరోనా వైరస్ మహమ్మారి” సంవత్సరంగా గుర్తిస్తే, మా పార్టీ మాత్రమే అవినీతి చేసిన దోపిడీదారుల ఆట కట్టించే సంవత్సరంగా గుర్తించినట్లు విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు. దీంతో విజయసాయిరెడ్డి చేసిన సోషల్ మీడియాలో నాన్-స్టాప్ కామెంట్లతో తెలుగుదేశం పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అని ఏపీ రాజకీయాల్లో టాక్ వస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?