విజయసాయిరెడ్డి విశాఖపట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై నిమ్మగడ్డ వ్యవహారంపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా దాదాపు మూడు తరాల తో అనుబంధం ఉందని విజయసాయిరెడ్డి వైయస్ జగన్ గురించి ఎమోషనల్ గా వైజాగ్ ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరిగింది.
గత కొన్నాళ్ల నుండి వైయస్ జగన్ మరియు విజయసాయిరెడ్డి మధ్య గ్యాప్ వచ్చిందని, జగన్ ఇదివరకు లాగా విజయసాయి రెడ్డి ని దగ్గరకు చేర్చుకోవడం లేదని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పదే పదే కథనాలు ప్రసారం చేసింది. ఈ విషయం గురించి నేరుగా మీడియా చానల్ పేరు సమావేశంలో ప్రస్తావించి మాట్లాడుతూ జగన్ తోనే ఈ జన్మంతా. ఇందులో రెండో మాటే లేదు. ఆ డౌటే ఎవరికీ అవసరం లేదు.
జగన్ తాను వేరు కావాలని ఆశపడేవారి జన్మంతా నిరాశ తప్పదని కూడా తేల్చేసారు. అంతేకాకుండా పార్టీ వ్యవహారాలన్నీ రాబోయే రోజులు నేను చూసుకుంటాను, దానిలో ఎటువంటి డౌటు లేదు అంటూ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. విజయసాయి రెడ్డి ఈ విధంగా ఎమోషనల్ అవ్వటానికి మరొక కారణం…. తనని ఢిల్లీకి పరిమితం చేసి జగన్ కి అత్యంత రాజకీయ సలహాదారుడిగా పేరొందిన ఒక వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నట్లు ఆ మీడియా చానల్ ప్రసారం చేయడంతో ఈ విధంగా సాయి రెడ్డి ఎమోషనల్ అయినట్లు పార్టీ లో టాక్ నడుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?