వైసీపీ పార్టీలో వైఎస్ జగన్ తర్వాత ఎక్కువగా వినిపించే పేరు సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. పార్టీకి సంబంధించి కీలక వ్యక్తుల విషయాలు, అమలు చేయటంలో విజయసాయిరెడ్డి ఎప్పుడూ ముందుంటారు. అంతేకాకుండా సోషల్ మీడియా రాజకీయ ప్రత్యర్థులను తన వెటకారపు కామెంట్లతో పోస్టులతో ఓ ఆట ఆడుకుంటారు. ట్విట్టర్ వేదికగా యాటకారపు ప్రశ్నలు ఓ రేంజిలో సంధించే విషయంలో ఎదురులేని రాజకీయ నేతగా దూసుకుపోతూ ఉంటారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ని టార్గెట్ చేస్తూ ఎప్పుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ఏదో ఒకటి పెడుతూ ఉంటారు.
అటువంటిది కరోనా బారిన పడటంతో ట్విట్టర్ రాజకీయాలకి కాస్త గ్యాప్ ఇచ్చిన విజయసాయి రెడ్డి…. ఇటీవల కరోనా నుండి కోలుకోవటంతో మళ్లీ స్టార్ట్ చేశారు. “వైయస్సార్ చేయూత” కార్యక్రమాని ఇటీవల ప్రభుత్వం నిర్వహించినా సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైయస్ జగన్ 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ మహిళలకు ఏడాదికి 18,750 రూపాయలు మొత్తం నాలుగు ఏళ్ళపాటుగా ఇచ్చి రాష్ట్రంలో పేదరికానికి శాశ్వతంగా చెక్ పెట్టడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు అంటూ విజయ్ సాయిరెడ్డి కొనియాడారు. గిరిజన పుత్రుల చంద్రబాబు వహించాడు….అడవిబిడ్డల గుండెలనిండా వైయస్సార్ మరియు జగన్ గారే ఉన్నారు అని పేర్కొన్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి మళ్ళీ ట్విట్టర్లో బ్యాక్ ఇన్ యాక్షన్ అన్నట్టుగా రాణిస్తున్నారు.