దాదాపు పది సంవత్సరాలు అనేక ఆటుపోట్లను ఎదుర్కొని అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఏమాత్రం అనుభవం లేని ఈ నేపథ్యంలో చాలా మంది ఆయన పరిపాలనపై స్టార్టింగ్ లో సెటైర్లు వేశారు. కానీ జగన్ ఏడాది పరిపాలనకు దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నాయకులతో పాటు మీడియా సైతం ప్రశంసలు కురిపించింది. కరోనా వైరస్ లాంటి సంక్షోభ సమయంలో కూడా ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు గురించి చాలామంది విని ఏపీ ప్రజలు అదృష్టవంతులు అని ఇతర రాష్ట్రాల రాజకీయ నేతలు జగన్ పరిపాలన పై ఇటీవల తెగ పొగుడుతున్నారు.
ముఖ్యంగా దేశంలో కరోనా వైరస్ పై పోరాటం విషయంలో చాలా రాష్ట్రాల నేతలు చేతులెత్తేసిన పరిస్థితి ఉంటే ఏపీలో మాత్రం వైయస్ జగన్ తన నిర్ణయాలతో అద్భుతంగా పోరాడుతున్నారని.. కరోనా వైరస్ నుండి తప్పించుకోవాలంటే ఏపీ సేఫ్ ప్లేస్ అని అంటున్నారు. ఇలాంటి తరుణంలో వైయస్ జగన్ ఏడాది పరిపాలనపై విజయ్ సాయి రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఏడాది పరిపాలన జస్ట్ ట్రైలర్ అని ట్విట్టర్ లో అభివర్ణించారు. సీఎం జగన్ గారి ఏడాది పరిపాలన ‘ట్రైలర్’ కే కలుగులో దాక్కున్న ఎలుకలా హైదరాబాద్ లో గడుపుతున్న బాబు వచ్చే నాలుగేళ్లలో అసలు సినిమా చూసి ఏమవుతాడో? అనుభజ్ఞుడని గెలిపించిన ప్రజలను ఎంగిలి విస్తరాకుల్లా విసిరేసి, దోపిడీలు, స్కాములు చేస్తూ దొరికి పోయాడు. దొంగల ముఠా జైలు కెళ్లాల్సిందే అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.