తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కేసీఆర్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలం అయిందని, పరిపాలన యంత్రాంగం మొత్తం అటకెక్కింది అని విమర్శించారు. దానికి నిదర్శనం తాజా పరిణామాలు అని ఆమె పేర్కొన్నారు. చిన్నపాటి జల్లులు పడితే చాలు మహా నగరం హైదరాబాదు ఎలాగో జలమయం అవుతుంది కాపాడలేకపోయారు. అటువంటిది ప్రభుత్వ చేతగానితనం వల్ల ఇప్పుడు వరంగల్ కూడా బలై పోతున్నట్లు ఆమె ఆరోపణలు చేశారు.
అంతేకాకుండా భూకబ్జాలు ఆపలేక రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ ఘోరంగా విఫలం అయినట్లు, రాష్ట్రంలో భూకబ్జా ల విషయంలో ఇటీవల రెవెన్యూ వ్యవస్థ ఎంత దారుణంగా పనిచేస్తుందో కోటి రూపాయల లంచం ఘటన తెలియజేస్తుందని ప్రభుత్వాన్ని విజయశాంతి ఎండగట్టారు. అంతే కాకుండా తెలంగాణలో కరోనా హాస్పిటల్ గా పేరొందిన గాంధీ ఆసుపత్రి ఇటీవల పలుమార్లు అగ్ని ప్రమాదానికి గురైన ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదని షాకింగ్ కామెంట్ చేశారు.
అదే రీతిలో కరోనా ట్రీట్మెంట్ విషయంలో ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్ సామాన్య ప్రజలను అనేక రీతులుగా ఇబ్బందులకు గురి చేశాయని దానికి నిదర్శనం హైకోర్టు వేసిన మొట్టికాయలు అని విజయశాంతి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా త్వరలో హైదరాబాద్ నడిబొడ్డులో ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ నగరంలో కరోనా కట్టడి విషయంలో, రోడ్లు జలమయం విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ రీతిగా ఫెయిల్ అయిందో అన్ని విషయాలు కడిగిపారేసే విధంగా విజయశాంతితో టి కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.