NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijaya Sai Reddy: న్యాయశాఖ మంత్రి వద్దకు రఘురామ వ్యవహారం..! చట్ట సవరణ చేసేస్తారా..!?

Vijaya Sai Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఏపి ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిన రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ ఎంపీలు పలు మార్లు స్పీకర్ కు పిటిషన్ లు అందజేసినా ఇంత వరకూ చర్యలు చేపట్టని విషయం తెలిసిందే. రఘురామపై పిటిషన్ అందజేసి దాదాపు 13 నెలలు దాటినా ఇటీవల కాలంలోనే స్పీకర్ ఓంబిర్లా ఆయనకు నోటీసు జారీ చేశారు. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, సీఎం జగన్ నిర్ణయాలను తప్పుబడుతూ బహిరంగంగా రఘురామ కృష్ణంరాజు ఇష్టానుసారం విమర్శలు, ఆరోపణలు చేస్తునే ఉన్నారు. రఘురామపై చర్యలు తీసుకోకపోతే పార్లమెంట్ లో ఆందోళన చేస్తామని కూడా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గతంలో పేర్కొన్నారు.

Vijaya Sai Reddy and other ycp mp's meet law minister
Vijaya Sai Reddy and other ycp mps meet law minister

అయితే ఈ అంశంపై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఆందోళన చేయలేదు. కానీ స్పీకర్ ఓంబిర్లా రఘురామ పై అనర్హత వేటు వేయకపోవడంతో తీవ్ర అసహనంతో ఉన్న వైసీపీ ఎంపీలు నిన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఫిరాయింపులకు పాల్పడే వారిపై గడువులోగా చర్యలు తీసుకునేలా చట్టాన్ని సవరించాలని కోరుతూ వైసీపీ ఎంపిలు విజయసాయిరెడ్డి నేతృత్వంలో పలువురు ఎంపీలు వినతి పత్రం సమర్పించారు. ఇటువంటి చట్ట సవరణ అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా చేస్తుందా అన్నదే ఇక్కడ సమస్య. బీజేపీ గూటికి చెందిన ఇద్దరు టీఎంపీ ఎంపీలపైనా అనర్హత పిటిషన్లు పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. చట్ట సవరణ చేస్తే బీజేపీలో చేరిన టీఎంసీ ఎంపీలపైనా అనర్హత వేటు వేయాల్సి వస్తుంది. ఈ తరుణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ..ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి సవరణలు చేయడానికి ముందుకు వస్తుందా అనేది ప్రశ్నార్ధకమే కదా.

ఇకపోతే ఏపి హైకోర్టును, జాతీయ న్యాయ యూనివర్శిటీని కర్నూలుకు తరలించాలని న్యాయశాఖ మంత్రికి ఇచ్చిన విజ్ఞాపనలో పేర్కొన్నారు. ఇంతకు ముందే హైకోర్టు తరలింపు అంశం తమపరిధిలో లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏకాభిప్రాయంతో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని చెప్పేసింది. మూడు రాజధానుల అంశానికి సంబంధించి పిటిషన్లు విచారణ జరుగుతున్న తరుణంలో హైకోర్టు తరలింపునకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారా అన్నది అనుమానాస్పదమే. ఈ రాజధాని పిటిషన్ పై ఏదో ఒక తీర్పు వెలువడిన  తరువాత ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞాపన పంపితే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ రాష్ట్రంలో పరిష్కరించుకునే సమస్యపై కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇవ్వడం వల్ల ఉపయోగం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో విజయసాయి రెడ్డితో పాటు మోపిదేవి వెంకట రమణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, చంద్రశేఖరరెడ్డిలు ఉన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju