ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎన్నికల నియమావళిని ఉల్లగిస్తుందని వైసిపి నేతల బృందం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నేతృత్వంలో వైసిపి నేతల బృందం సోమవారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరాను కలిసింది.
రాష్ట్రంలో టిడిపి అరాచకాలు సృష్టిస్తోందనీ, తమ పార్టీ నేతలపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు.
అలాగే ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉన్న ప్రస్తుత ప్రభుత్వం గతంలో చెల్లించాల్సిన చెల్లింపుల కోసం పెద్ద ఎత్తున ఓవర్ డ్రాఫ్ట్(అప్పు) ద్వారా చెల్లిస్తుందని వైసిపి నేతలు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.
ప్రధానంగా ఈవిఎం భద్రతపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి సహకరించే పరిస్థితి లేదనీ, స్ట్రాంగ్ రూమ్ల వద్ద రాష్ట్ర పోలీసులకు బదులు కేంద్ర బలగాలను మోహరించాలని వారు విజ్ఞప్తి చేశారు. మచిలీపట్నంలో ఈవిఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లోపలి దృశ్యాలు బయటకొచ్చాయని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు.
వైసిపి నేతల బృందంలో విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బాలశౌరి, సి.రామచంద్రయ్య, అవంతి శ్రీనివాస్, బుట్టా రేణుక తదితరులు ఉన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?