అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ కు ప్రసంగాల్లో తప్పులు దొర్లటం సర్వ సాధారణం అయిపోయింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలు విమర్శలు చేయటానికి ఆస్కారంగా మారుతున్నాయి. ఆయన్ని పప్పుగా సంబోధిస్తూ ప్రతిపక్ష నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
ఇటీవల పోలింగ్ సందర్భంగా ….దేశంలో 545 పార్లమెంట్ స్థానాలు ఉండగా లోకేష్ 900 పైగా స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని మాట్లాడటం హాస్యాస్పదంగా మారింది. ముఖ్యమంత్రి, ఆయన తండ్రి చంద్రబాబు పక్కన ఉన్నప్పుడే లోకేష్ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
అయితే ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వటంతో వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి లోకేష్ వ్యాఖ్యలపై విమర్శలు చేస్తూ గురువారం ట్వీట్ చేశారు.
‘పప్పు మళ్లీ ఇరుక్కున్నాడు. దేశంలో 900 లోక్ సభ స్థానాలున్నాయంట. మంగళగిరిలో 5 లక్షల మెజారిటీతో గెలిపించాలని కోరినట్లే ఉంది. తండ్రేమో రష్యన్ హ్యాకర్లు ఈవీఎంల ఫలితాలను మారుస్తారని గోల చేస్తున్నారు. ఇద్దరూ రాష్ట్రం పరువు మంట గలుపుతున్నారు. పప్పు, తుప్పులను గొలుసులతో కట్టేయాలేమో?’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
పప్పు మళ్లీ ఇరుక్కున్నాడు. దేశంలో 900 లోక్ సభ స్థానాలున్నాయంట. మంగళగిరిలో 5 లక్షల మెజారిటీతో గెలిపించాలని కోరినట్లే ఉంది. తండ్రేమో రష్యన్ హ్యాకర్లు ఈవీఎంల ఫలితాలను మారుస్తారని గోల చేస్తున్నారు. ఇద్దరూ రాష్ట్రం పరువు మంట గలుపుతున్నారు. పప్పు, తుప్పులను గొలుసులతో కట్టేయాలేమో?
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 25, 2019