అమరావతి: ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా చేర్చాలని కమిటీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా సంద్పించారు. ఆర్టీసిని విలీనం చేసి 60 వేల మంది ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకోవడం కొడిగడుతున్న దీపానికి ఏపీ సీఎం జగన్ ప్రాణం పోశారని విజయసాయి రెడ్డి అన్నారు. ప్రగతి చక్రాలిక జగన్నాథ రథచక్రాల్లా పరుగులు పెడతాయని చెప్పారు. ‘రాష్ట్రాన్ని దివాలా తీయిస్తారా అని మాత్రం రెచ్చిపోకండి చంద్రబాబునాయుడు గారూ. నవ్వుతారు’ అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. మరోవైపు ఆర్టీసీ విలీనంపై నిపుణుల కమిటీ మంగళవారం సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి నివేదిక సమర్పించింది. నేటి కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించనుంది.
ఆర్టీసిని విలీనం చేసి 60 వేల మంది ఉద్యోగులను గవర్నమెంటులోకి తీసుకోవడం కొడిగడుతున్న దీపానికి ప్రాణం పోశారు @AndhraPradeshCM గారు. ప్రగతి చక్రాలిక జగన్నాథ రథచక్రాల్లా పరుగులు పెడతాయి. రాష్ట్రాన్ని దివాలా తీయిస్తారా అని మాత్రం రెచ్చిపోకండి @ncbn గారూ. నవ్వుతారు. @ysjagan
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 4, 2019