తెలుగు రాజకీయాలలో కృష్ణా జిల్లా అంటే టిడిపి పార్టీకి కంచుకోట అని అందరికీ తెలుసు. ఎలాంటి ఎన్నికలు అయినా ఈ జిల్లాలో మెజార్టీ స్థానాలు ఎక్కువగా ప్రజలు తెలుగుదేశం పార్టీకే కట్టబెడుతుంటారు. అటువంటి జిల్లాలో విజయవాడ నగరానికి చెందిన టిడిపి పార్టీకి స్ట్రాంగ్ లీడర్ గా కేశినేని నాని కి మంచి పేరు ఉంది. ముఖ్యంగా 2019 ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ హవా కొనసాగిన గాని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని కేసినేని నాని తిరిగి తన స్థానాన్ని పదిలంగా కాపాడుకున్నారు.
పార్టీలో చంద్రబాబు నాయుడు ని సైతం ప్రశ్నించ గల నాయకుడిగా కేశినేని నానికి మంచి పొలిటికల్ ట్రాక్ రికార్డు ఉంది. అటువంటి కేశినేని నాని విజయవాడ నగర మేయర్ అభ్యర్థిగా తన కూతురు శ్వేతా కేసినేని నీ రంగంలోకి దింపాలని ప్రయత్నం చేస్తుండగా పార్టీలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వర్గం అడ్డుకోవటానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు టిడిపి పార్టీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. గద్దె రామ్మోహన్ రావు ఎలాగైనా విజయవాడ మేయర్ అభ్యర్థిగా తన భార్య అనురాధ ని నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తూ విజయవాడలో టిడిపిలో కీలక నాయకుల సపోర్ట్ తీసుకుని జిల్లాలో కేసినేని నాని నాయకత్వ పెత్తనంపై చంద్రబాబుకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ముఖ్యంగా తన కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం విజయవాడ ప్రాంతంలో టిడిపి క్యాడర్ ని దెబ్బకొట్టే రీతిలో కేశినేని నాని వ్యవహరిస్తున్నట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అనుచరులతో చంద్రబాబుకి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా చంద్రబాబు ఒకవేళ వచ్చే స్థానిక ఎన్నికలలో విజయవాడ మేయర్ టికెట్ కేశినేని నాని కూతురుకి ఇస్తే గద్దె రామ్మోహన్ వర్గం వైసీపీ పార్టీకి సహకరించి ఎలాగైనా కేశినేని నాని ని దెబ్బకొట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మొత్తంమీద విజయవాడ ప్రాంతంలో గద్దె వర్సెస్ కేశినేని నాని అన్నట్టు టిడిపి పార్టీ గ్రూపు రాజకీయాల తో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.