టీడీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. రాష్ట్రంలో వరుసగా టీడీపీ కి చెందిన కీలక నాయకులు గత ప్రభుత్వంలో చేసిన కుంభకోణాలలో ఆధారాలతో సహా దొరికిపోవడం మరోపక్క ఒక్కొక్కరు పార్టీని విడిపోవటంతో టీడీపీ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. 2019 ఎన్నికలలో ఏపీ ప్రజలు కోలుకోలేని తీర్పు ఇవ్వడంతో పార్టీని నడిపించడానికి చంద్రబాబు అనేక అవస్థలు పడుతున్నారు. మరోపక్క జగన్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ పరిపాలనలో దూసుకుపోతున్నారు. దీంతో ఇప్పటికే చాలా మంది టీడీపీ పార్టీలో భవిష్యత్తు రాజకీయాలు దృష్టిలో పెట్టుకుని వైసీపీ లోకి వచ్చేస్తున్న సన్నివేశాలు ఇటీవల కనబడుతున్నాయి.
ఇదిలా ఉండగా ఒకప్పుడు విజయనగరం జిల్లా టీడీపీకి కంచుకోటగా వుండేది. 2014 ఎన్నికల్లో భారీ స్థానాలను తెలుగుదేశం పార్టీకి జిల్లా వాసులు ఇవ్వటం జరిగింది. కానీ ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా టీడీపీ ఇక్కడ గెలవలేకపోయింది. దీంతో జిల్లా టీడీపీ క్యాడర్ లో ప్రస్తుతం గ్రూపు రాజకీయాలు తారస్థాయిలో ఉన్న నేపథ్యంలో మూడుసార్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ వైసీపీ పార్టీలోకి రావటానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
ముఖ్యంగా పార్లమెంట్ సెగ్మెంట్ వారీగా జిల్లా విభజన జరిగితే పార్వతీపురంకి చెందిన జగదీష్ కి విజయనగరం తో సంబంధాలు తెగిపోతాయి. పార్వతీపురం అరకు లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్ని ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా పావులు కదుపుతున్నట్లు సమాచారం. గతంలోనే జగదీష్ వైసీపీ గూటిలోకి చేరాలని ప్రయత్నించిన పార్వతీపురం వైసీపీ ఎమ్మెల్యే జోగారావు అడ్డు తగిలినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల జిల్లాకు చెందిన వైసీపీ పార్టీ పెద్దలతో మంతనాలు జరిపి మొత్తం లైన్ క్లియర్ చేసుకుని త్వరలోనే వైసీపీ లో చేరడానికి ద్వారపురెడ్డి జగదీష్ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.