విశాఖ: పార్టీ మారనున్నారంటూ తనపై వస్తున్న పుకార్లను విశాఖ పశ్చిమ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే పెతకంశెట్టి గణవెంకట రెడ్డినాయుడు (గణబాబు) ఖండించారు. తాను పార్టీ మారనున్నారంటూ పుకార్లు సృష్టించింది మీడియానేనని ఆరోపించారు. ఎవరికైనా పార్టీ మారే ఆలోచన ఉంటే వాళ్లే మీడియా ముందుకు వచ్చి చెప్పే పరిస్థితి ఉందని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తాను పార్టీ మారనని గణబాబు స్పష్టం చేశారు.
విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆత్మీయ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారనీ, టిడిపి నేతలే ఆయన్ని కలిసినట్లు ప్రచారం చేశారనీ అన్నారు. సుజనా చౌదరితో టచ్లో ఉన్నారంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు.