Visakhapatnam Lands: విశాఖలో భూమాయ Visakhapatnam Lands ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. విశాఖలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తోంది. టీడీపీ అధికారంలో ఉండగా ఆ ప్రాంతానికి చెందిన ఓ మంత్రి భూముల స్కాంకు తెరలేపారని ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఆరోపించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూముల లెక్క తేల్చుతున్నట్టు ప్రకటిస్తోంది. ఆమధ్య గీతం యూనివర్శిటీ, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, సబ్బం హరి.. ఇలా కొందరు ఆక్రమణలకు పాల్పడ్డారని వారి భూములు స్వాధీనం చేసుకుంటోంది ప్రభుత్వం. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సోదరుడు ఆక్రమణలకు పాల్పడ్డారని ఆ భూములు స్వాధీనం చేసుకుంది.
ఏడాది కాలంలో 4,291 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని ఆక్రమణల నుంచి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు సాక్షి పత్రికలో ప్రముఖంగా ప్రచురించారు. అయితే.. 2019 నవంబర్ నుంచి 2020 నవంబర్ మధ్య కాలంలో విశాఖలో భూముల క్రయవిక్రయాలకు సంబంధించి 50వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. విశాఖలో రాజధాని ఏర్పాటు ప్రకటన జరిగిన తర్వాత.. ఇన్ని భూములు కొనుగోలు జరిగింది. వీటిలో అధికారపార్టీ నాయకులు ఉండరా.. చట్టప్రకారమే భముల కొనుగోలు జరిగిందా? అనేది ఒక ప్రశ్న. దీనిపై సీబీఐ ఎంక్వైరీ వేస్తే.. నిగ్గు తేలడం ఖాయమే. భూములు ఎవరు కొన్నారు.. ఎవరు అమ్మారు అనేది వెలుగులోకి వస్తుంది. కానీ.. అలాంటిది జరక్కుండా కేవలం ప్రతిపక్ష నేతలు ఆక్రమించుకున్నారంటూ ఆ భూముల్ని స్వాధీనం చేసుకుంటున్నారు.
Read More: Laxmi Aparna: లక్ష్మీ అపర్ణకు అండగా మహిళా సంఘాలు..! సమస్య జటిలమవుతోందా..?
భూమాయ అనేది ఎక్కడైనా జరిగిపోతుంది. అధికార ఉన్నప్పుడే టీడీపీ నాయకులు భూ అక్రమాలకు పాల్పడితే.. ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు ఇటువంటివి చేయలేరా? ఏడాదిలో 4వేల కోట్ల ప్రభుత్వ ఆస్తిని స్వాధీనం చేసుకుంటే.. ఈ ఏడాది కాలంలో 50వేల భూమి రిజిస్ట్రేషన్లు ఎవరు చేసినట్టు. రాజకీయాల్లో ఉన్న వారిపై ఇటువంటి ఆరోపణలు (నిజాలు కూడా ఉండొచ్చు) సహజమే. ఏదేమైనా విశాఖలో ఏదో జరుగుతోంది. రాజధాని తరలి వెళ్లే క్రమంలో ప్రశాంత విశాఖలో రాజకీయ కల్లోలం నడుస్తోంది. అధికార, ప్రతిపక్షాలు ప్రశాంతంగా ఉన్న ప్రజలకు.. అదే ప్రశాంతతను దూరం చేస్తున్నారు. విశాఖలో ఏం జరుగుతుందో కాదు.. ఏదో జరుగుతోంది. ఆ నిగ్గు తేలాల్సి ఉంది.