విశాఖపట్నం: విశాఖలో ల్యాండ్ పూలింగ్ కార్యక్రమాన్ని తక్షణమే నిలిపేయాలని కోరుతూ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్కు వ్యవ సాయ కార్మికసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంక టేశ్వర్లు, సిపిఎం విశాఖజిల్లా కార్యదర్శి కె లోకనాథం వినతిపత్రం ఇచ్చారు. విశాఖ జిల్లాలోని 10 మండలాల్లో 54 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కోసం ప్రభుత్వం జిఒ 72ను తెచ్చిందనీ, ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకంగా ఉందని వారు తెలిపారు. జనవరి 29 నుండి ఈ నెల 8 వరకు జరిగిన గ్రామ సభల్లో ల్యాండ్ పూలింగ్ చేయవద్దు అంటూ రైతులంతా ముక్తకంఠంతో వ్యతిరేకించారని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం పేద చిన్న,సన్నకారు రైతుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. ల్యాండ్ పూలింగ్ను తక్షణమే నిలిపేసి పేదలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు…
previous post
next post