ఇప్పటికే కరోనా వైరస్ ని ఎదుర్కొనే విషయంలో కేసిఆర్ సర్కారు పూర్తిగా విఫలమైందని ప్రజలు బలంగా నమ్ముతున్నాట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో పడిన వర్షాల వల్ల చాలా ప్రాంతాలలో నీటి నిల్వలు ఉండటంతో మరింతగా టిఆర్ఎస్ పార్టీపై విమర్శలు పెరిగాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లా దాదాపు జలమయం కావడంతో రోడ్లు అన్ని నీళ్లతో నిండిపోవడంతో ప్రజలు టిఆర్ఎస్ పార్టీ ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిరుగుతున్నారు.
పరిస్థితి ఇలా ఉండగా వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అనుచరులు భూకబ్జాలకు పాల్పడటం ఆ విషయం ప్రస్తుత పరిస్థితుల్లో బయటపడటంతో ప్రజలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా టిఆర్ఎస్ ఎంపీ అనుచరులు కూడా వరంగల్ భద్రకాళి చెరువు కబ్జా చేసి… అక్కడ క్యాంపు కార్యాలయం కట్టారని, ప్రభుత్వ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
వరంగల్ జిల్లాలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు దారుణాలకు పాల్పడుతున్నారని జిల్లా ప్రజల నుండి ఆరోపణలు తీవ్రస్థాయిలో టిఆర్ఎస్ పార్టీకి వస్తున్నాయి. వరంగల్ లో ఎవరైతే కబ్జాలకు పాల్పడ్డారో… వారందరిపై కటిన చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా కబ్జా జరిగిన చోట్ల భవనాలను కూల్చివేయాలని ప్రజలు కోరుతున్నారు. మొత్తంమీద కేసిఆర్ కి కరోనా వైరస్ రూపంలో విమర్శలు వస్తున్న సమయంలోనే తాజాగా వరంగల్ జిల్లాలో ప్రజా ప్రతినిధులు భూకబ్జాలు వ్యవహారం బయట పడటం కేసీఆర్ కి పెద్ద తలనొప్పిగా మారిందని పార్టీలో టాక్.