ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇటీవల పోలీసు శాఖలో కొంతమంది వల్ల మొత్తం పోలీసులకు చెడ్డపేరు వస్తుందంటూ కామెంట్ చేస్తే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ముఖ్యంగా ఇటీవల తూర్పుగోదావరి, చీరాల అదేవిధంగా ఉత్తరాంధ్రలో దళితులపై పోలీసులు చేయి చేసుకోవడం తో చాలా వరకు పోలీసు వ్యవస్థ పరువు తీసేసినట్టు అయింది. తూర్పుగోదావరి శిరోముండనం ఘటన దాదాపు రాష్ట్రపతి దాకా వెళ్లింది. అయితే ఈ కేసులో ఎస్ఐ ని సస్పెండ్ చేసినా గాని అసలు నేరస్తులు అధికార పార్టీకి చెందిన వారని దళిత నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
మరి ఇటువంటి నేతల తప్పులను కూడా ఖండించాలి కదా అంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ నీ ప్రశ్నిస్తున్నారు. ఒక్క పోలీస్ వ్యవస్థ మాత్రమే కాదు అధికార పార్టీ నేతల అండ చూసుకుని వైసిపి కార్యకర్తలు కూడా రెచ్చిపోతున్నారు, నెల్లూరులో ఏకంగా ఓ సీనియర్ జర్నలిస్టు ఇంటి పైకి వెళ్లి దాడులకు పాల్పడ్డారు అంటూ మరికొంతమంది ఆరోపించారు.
మీ బాధ మాకు అర్థమైంది డీజీపీ గారు…. అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఒక పోలీసు వ్యవస్థ మాత్రమే కాదు అధికార పార్టీ నేతల ప్రోద్బలం వల్లనే రాష్ట్రంలో దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. మరి దీనికి మీ దగ్గర నుంచి ఎటువంటి స్పందన వస్తుందో అంటూ ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో దళితుల పై అదే విధంగా ఇతర పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నట్లు విపక్షాల నుంచి విమర్శలు మొదట నుండి వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఒక పోలీస్ వ్యవస్థ ని విమర్శించడని చాలామంది తప్పు పడుతున్నారు.