ఢిల్లీ, జనవరి 26: రామజన్మభూమి వివాదాన్ని 24గంటల్లోగా పరిష్కరిస్తానంటూ ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ అన్నారు. సుప్రీంకోర్టు ఈ వివాదాన్ని తర్వితగతిన పరిష్కరించాల్సిన ఆవస్యకత ఎంతైనావుందని ఆయన అన్నారు. కోర్టు పరిష్కరించలేని పక్షంలో తాము 24 గంటలు దాటకముందే సమస్యకు పరిష్కారం చూపుతామని ఆయన చెప్పారు.
సత్వరం న్యాయం చేయాల్సిందిగా ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. అనేక కోట్లమంది ప్రజలు కోర్టు తీర్పు కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పారు. అనవసరమైన ఆలస్యం వల్ల ప్రజల సహనం, నమ్మకం ప్రభావం పడుతుందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఈ కేసును ముగించడానికి ఇష్టపడటం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
అయోధ్య వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో నూతన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.