West Bengal Politics: పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు ముగిసి,, ఫలితాలు వచ్చేసాయి.. ఇక వివాదాలు ఆగుతాయి.. రాజకీయాలు తగ్గుముఖం పడతాయి.. అనుకున్న ఆ రాష్ట్ర వాసులకు అసలైన రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓడిన బీజేపీ తమ చేతిలో ఉన్న అస్త్రాలను రంగంలోకి దించుతుంది. తృణమూల్ నేతలపై, సీఎం మమతా బెనర్జీపై రెండు కీలక కేసులున్నాయి. శారదా చిట్స్, రోజ్ వాలీ చిట్స్ కుంభకోణం కేసుల్లో ఆమె ముద్దాయిగా ఉన్నారు. ఈ కేసులో ఈ రోజు ఉదయమే ఇద్దరు మంత్రులను, ఓ ఎమ్మెల్యేను సీబీఐ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. రేపు, ఎల్లుండి మరిన్ని అరెస్టులు ఉంటయాని అక్కడ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో మమతా కదిలారు. సీబీఐ కార్యాలయం ముందు చాల సేపు బైఠాయించారు.
West Bengal Politics: ఈరోజు ఇద్దరు అరెస్టు.. రేపు మళ్ళీ ..!?
ఈ కేసులో ఈరోజు బెంగాల్ మంత్రి వర్గంలోని ఇద్దరు మంత్రులను అరెస్టు చేసారు. మంత్రులు ఫిర్హాద్ హకీమ్, శుభ్రత ముఖర్జీలను అరెస్టు చేశారు. వారితో పాటూ మరో సీనియర్ ఎమ్మెల్యే మదన్ మిత్రా, మాజీ మేయర్ సోమం ఛటర్జీలను కూడా సీబీఐ ఈరోజు ఉదయమే అదుపులోకి తీసుకుంది. దీన్ని నిరసిస్తూ మమతా బెనర్జీ తృణమూల్ కార్యకర్తలతో కలిసి సీబీఐ ఆఫీస్ ముందు ధర్నా చేసారు. అరెస్టు విషయం తెలిసిన వెంటనే కార్యకర్తలతోనూ.. ముఖ్యనేతలతోనూ కలిసి కోల్ కటాలోని సీబీఐ కార్యాలయం ముంగిటకు వెళ్లి గంటన్నర పాటు ఆందోళన నిర్వహించారు. చాలా సేపటికి పోలీసులు, సీబీఐ అధికారులు వారించడంతో వెనక్కు తగ్గారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “ఎన్నికల్లో ఓడిన సీబీఐ ఇలా కక్ష తీర్చుకుంటుంది. సీబీఐ మా వాళ్ళని విసిగిస్తుంది. నన్ను అరెస్టు చేయండి. మా వాళ్ళని వదిలేయండి” అంటూ బీజేపీపై విరుచుకుపడ్డారు.