వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి తన ప్రభుత్వం కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఉంటుందని చెబుతూనే వస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని చెబుతూనే ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసే రోజు నాడు కూడా రాజకీయాలు చూడను మతాలు చూడను పార్టీల చూడను ప్రాంతాలను చూడను ప్రతిఒక్కరికీ తన ప్రభుత్వం తగిన రీతిలో న్యాయం చేస్తుందని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇటీవల కొన్ని ప్రాంతాలలో అవకతవకలు జరుగుతున్నట్లు వార్తలు రావడంతో వెంటనే అధికారులను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని సీక్రెట్ సర్వే చేయించినట్లు టాక్ వస్తోంది.
అయితే చేయించిన ఈ సర్వే లో కొంతమంది పార్టీలో ఉన్న నాయకులు మరియు పార్టీ కేడర్ కి చెందినవారు కొంతమందికి సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకుంటున్న ట్లు తేలిందట. దీంతో వెంటనే ఈ విషయం తన దృష్టికి రావడంతో జగన్ ఏ ప్రాంతంలో అయితే ఇలాంటివి జరుగుతున్నా యో ఆ ప్రాంతంలో ప్రత్యేకమైన అధికారులతో నిఘా పెట్టినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇదే తరుణంలో పలు కీలక మంత్రులతో జగన్ చర్చించినట్లు…. ఎక్కడ అవకతవకలు జరుగుతున్నాయో వంటి విషయాలలో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పినట్లు సమాచారం. ఏది ఏమైనా పరిపాలన విషయంలో సంక్షేమాలు ఇతరులకు అందకుండా సొంత పార్టీ వారే కొన్ని చోట్ల అతి చేస్తున్నట్లు జగన్ దృష్టికి రావడంతో ఆ ప్రాంతాలపై జగన్ ప్రత్యేకమైన నిఘా బృందాలను ఏర్పాటు చేసినట్లు వార్తలు గట్టిగా వైరల్ అవుతున్నాయి.