ఆగస్టు 16వ తేదీ.. ఏపీలో కీలకం కాబోతుందా?. ఏపీ రాజకీయం, ఏపీ రాజధాని వ్యవహారంలో ఆ తేదీ ఒక చారిత్రక అంశంగా మిగిలిపోతుందా?. ఇంతకూ ఆగస్టు 16 కు అంత ప్రాధాన్యత ఎందుకు? ఆ రోజు ఏం జరగనుంది అనేది ఒక్కసారి చూద్దాం.
కోర్టులో క్లియరెన్స్ వస్తే రాజధానికి అంకురార్పణ ఆ రోజే..!
రాజధాని తరలింపు విషయంలో హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. యధాతథ స్థితి లో ఆలా నిలిపివేసి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. అయితే ప్రభుత్వం మాత్రం హైకోర్టుతో లాభం లేదనుకొని సుప్రీంకోర్టు వరకు వెళుతుంది. హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఎత్తివేసి తమకు అనుమతులు ఇవ్వాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో రేపు విచారణ కు రానుంది. అంతా అనుకున్నట్టు జరిగితే సుప్రీంకోర్టు రాజధాని తరలింపునకు అనుమతులు ఇస్తుందని, హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎత్తివేస్తుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరుగుతుందని భావించి ఆగస్టు 16వ తేదీన విశాఖలో రాజధాని శంకుస్థాపనకు ముహూర్తం పెట్టినట్లు తెలిసింది. అందుకు సంబందించి ఆ జిల్లా కలెక్టర్, ఆ జిల్లా మంత్రులతో పాటు తెర వెనుక విజయసాయి రెడ్డి, సీఎం పేషీ నుండి కీలక అధికారులు కూడా విశాఖలో తిష్ట వేసి కార్యక్రమాలను నడిపిస్తున్నారు. రాజధానికి శంకుస్థాపనకు అవసరమైన ప్రాంతాలను గుర్తించడంతో పాటు సీఎం కార్యాలయం, క్యాంపు కార్యాలయం, పరిపాలనా భవనం తదితర తాత్కాలిక భవనాలను చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల లోనూ ఆగస్టు 16 వ తేదీ అమరావతి నుండి పరిపాలన రాజధానిని విశాఖకు తరలించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గట్టిగా నిర్ణయం తీసుకున్నారు.
టిడిపీ పతనానికి నాంది ఆ రోజేనా?
రాజధాని తరలింపుతో అమరావతిలో రాజధాని అనే అంశం ఇక ముగిసిపోతుంది. అంటే టీడీపీ ముద్ర, టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాలను జగన్ దాదాపు చెరిపేసినట్లే. ఇక అదేరోజున టీడీపీకి కీలకంగా ఉన్న నాయకులను వైసీపీలో చేర్చుకోవడం ద్వారా టీడీపీని మరింత బలహీన పర్చాలని జగన్ భావిస్తున్నారు. అందుకే విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగస్టు 16వ తేదిన్నే జగన్ కు మద్దతు పలుకుతారని అయన అనుచరులు కొంత మంది మాజీ ఎమ్మెల్యే లు ఇద్దరు వైసీపీలో చేరుతారని అనుకుంటున్నారు. వారితో పాటు పాడేరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ తో పాటు ఉత్తరాంధ్రకే చెందిన మరో మాజీ మంత్రిని కూడా వైసీపీలో చేర్చుకోవాలని జగన్ భావిస్తున్నారు. డానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. అంటే ఓ వైపు రాజధాని శంకుస్థాపన, మరో వైపు టీడీపీ కీలక నాయకులను వైసీపీలోకి చేర్చుకోవడం ద్వారా టీడీపీని నైతికంగా దెబ్బతీయవచ్చు అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?