**ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా సీఎం క్యాంపు కార్యాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు వచ్చి ఆశీర్వదించడం ఒక ఎత్తయితే….. దానిలో ముందువరుసలో జగన్కు ఆశీర్వచన ఇచ్చింది మాత్రం డాలర్ శేషాద్రి. తిరుమల శ్రీవారి ఆలయంలో పేస్కారు గా తన ఉద్యోగాన్ని ప్రారంభించిన డాలర్ శేషాద్రి తర్వాత నాయకులందరికీ దగ్గర వాడయ్యాడు. ప్రస్తుతం 70 ఏళ్ల వయసులోనూ ఓ ఎస్ డి అనే ప్రత్యేక పోస్ట్ లు పెట్టి మరీ డాలర్ శేషాద్రిని తిరుమల తిరుపతి దేవస్థానం భరిస్తోంది. నెలకు లక్ష రూపాయలకు పైగా ఆయనకు వేతనం ముట్ట చెబుతోంది… ఇవన్నీ పక్కనపెడితే డాలర్ శేషాద్రి కనీసం వేదాలు కాదు కదా మంత్రాలు చదివిన దాఖలాలు లేవు. కేవలం శ్రీవారి బంగారు డాలర్లు అమ్మే పని చూడాల్సిన డాలర్ శేషాద్రి… తర్వాత టీటీడీలో కీలకంగా మారారు. తన స్థాయిని రాజకీయ నాయకుల పలుకుబడితో పెంచుకున్నారు. అదంతా చెప్పకుంటే చాట భారతం అవుతుంది.. అయితే ఇప్పుడు ప్రధానంగా మాట్లాడాల్సింది ఏమిటంటే… పుట్టినరోజు ఈ సందర్భంగా జగన్ దగ్గరకు వెళ్లిన టీటీడీ వేదపండితుల అందరి ముందు డాలర్ శేషాద్రి కనిపించారు. ఆయనే ముందుగా జగన్కు అక్షంతలు వేసి దీవించడం పెద్ద అంశం. కనీసం వేదాలు తెలియని ఆయన వేదపండితుడి గా ఎలా అవుతారు..? వెళ్లిన జగన్ కు ముందుండి మరి అక్షంతలు వేసి దీవించాల్సిన విషయం ఏముంది అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. పోనీ వయసులో పెద్దవారు కాబట్టి అక్షింతలు వేశారని అనుకున్నా… వేదపండితులు ముందు నుంచుని వేదపండితుల అందరికీ అని నాయకత్వం వహిస్తున్నట్లు జగన్కు జన్మదినం రోజు డాలర్ చిన్న జర్క్ ఇచ్చారాని అంతా మాట్లాడుకుంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?