Corona : ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కి చాలా దేశాలలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావటం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ విషయంలో కీలక కామెంట్లు చేసింది. ప్రపంచంలో ఉన్న 20 పేద దేశాలకు ఇంకా కరోనా వ్యాక్సిన్ అందలేదు, ఇది చాలా విచారకరం అని వెల్లడించింది. గతంలో కంటే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని వీలైనంత త్వరగా పేద దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందజేయాలని పిలుపునిచ్చింది.
డబ్ల్యూహెచ్ వో చీఫ్ టెడ్రోస్ అధానోమ్ కనీసం ఒక ప్రపంచ దేశానికి కోటి వ్యాక్సిన్ లు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ విధంగా మహమ్మారి విజృంభించ డానికి కారణం కరోనా నిబంధనలను ప్రజలు పట్టించుకోకపోవటం వల్లనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్ పేద దేశాలకు అందకుండా స్వలాభం కోసం ఆతృత పడుతున్న ధనిక దేశాల తీరును ఖండించారు.
ఇటువంటి ప్రమాదకరమైన వైరస్ నుండి పేద ప్రజలను కాపాడటం బాధ్యత అని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం ఇండియాలో అద్భుత రీతిలో జరుగుతుండటం పట్ల అంతర్జాతీయ మీడియా భారత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. మరో పక్క భారత్ ప్రభుత్వం దేశంలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం చేస్తూనే మరోపక్క పేద దేశాలకు కూడా కరోనా టీకా డోస్ లు పంపిణీ చేస్తూ ఉంది.