నెల్లూరు జిల్లాలో అత్యంత సీనియర్ రాజకీయ కుటుంబంగా ఆనం ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన చరిత్ర ఆ కుటుంబానికి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా రాణించిన ఈ కుటుంబం విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా రాణించారు. కాగా సరిగ్గా 2019 ఎన్నికల ముందు వైసీపీ పార్టీలో చేరిన ఆనం రాంనారాయణ రెడ్డి వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అంతకుముందు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆనం ప్రస్తుతం మాత్రం గెలిచిన గాని పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలకు పాల్గొనకుండా ఉండటం జిల్లా రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.
ఒకప్పుడు మంత్రిగా కీలక శాఖలను డీల్ చేసే అనుభవం ఉన్నా ఇప్పుడు మాత్రం ఆయన ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలలో వేలు పెట్టకుండా కేవలం నియోజక వర్గానికి పరిమితం కావడం వైసీపీ వర్గాల లో పెద్ద హాట్ టాపిక్ అయింది. మరోపక్క పార్టీలో కూడా ఆనం రామనారాయణ రెడ్డిని పట్టించుకునేవారు కూడా లేరన టాక్ ఉంది. అంతకుముందు పార్టీ పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆనం, జగన్ తో భేటీ అయిన తర్వాత చాలా సైలెంట్ అయిపోయారు.
మరోపక్క నియోజకవర్గంలో అధికారులు కూడా ఆనం ఆదేశాలు సరిగ్గా పాటించడం లేదని దీంతో అటు ప్రజలకు ఇటు అధికారులకు ఏమీ చెప్పుకోలేక ఎవరికీ అందుబాటులో ఉండకుండా ఉంటున్నారని పార్టీకి చెందిన ఓ వర్గం ప్రచారం చేస్తోందట. ఇలా ఉండగా నెల్లూరు జిల్లా పర్యటనకు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చిన సమయంలో నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నాయకులంతా హాజరు కాగా ఆనం మాత్రం హాజరు కాకపోవడంతో…ఆయన రాకపోవడంపై గట్టిగా ప్రచారం జరుగుతోంది. కావాలనే రాలేదా లేకపోతే తనకి పార్టీ లో గౌరవం లేదు అన్న రీతిలో నిరసన ఈ విధంగా తెలిపారా ? అన్నది ఎవరికి అర్థం కావడం లేదు. ఏది ఏమైనా ఆనం రామనారాయణరెడ్డి సైలెంట్ రాజకీయం ఏపీ పొలిటికల్ వర్గాలలో పెద్ద హాట్ టాపిక్ గా మారినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.