టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీని మళ్లీ పునరుద్ధరించాలని అనేక పాట్లు పడుతున్నారు. 2019 ఎన్నికలలో దారుణమైన ఓటమి రావడంతో టిడిపి పార్టీలో బలమైన నాయకులు ఓడిపోవడంతో గెలిచిన వారు చాలావరకు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మరోపక్క వైయస్ జగన్ కరువు కాలంలో కూడా ఎక్కడా సంక్షేమ పథకాలు ఆగిపోకుండా, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ దూసుకుపోతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ని ఎదుర్కోవాలంటే కచ్చితంగా కేంద్రం అండగా ఉండాలని మోడీకి దగ్గరవటానికి చెయ్యని ప్రయత్నం లేదు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలిసి మోడీని వ్యక్తిగతంగా విమర్శించడం జరిగింది. దాంతో చాలావరకు చంద్రబాబు కి బిజెపి పార్టీ తలుపులు క్లోజ్ చేసిన పరిస్థితి నెలకొంది.
ఇటువంటి తరుణంలో ఏదో రీతిగా ఢిల్లీలో తనకు అత్యంత సన్నిహితంగా ఉండే నాయకులతో మోడీకి దగ్గర అవుదామని ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు ఫుల్ స్టాప్ పెడుతున్నారు. ఆయన చేస్తున్నా కామెంట్లు మోడీకి ఫ్లాష్ బ్యాక్ గుర్తుచేసే విధంగా చంద్రబాబుపై రగిలిపోయే రీతిలో ఉన్నాయి. తాజాగా సోము వీర్రాజు చంద్రబాబును ఉద్దేశించి….. గతంలో మోడీని అవమానించి పగ పట్టిన మీరు చేసిన బాగోతాలు అన్నీ గుర్తేనని పేర్కొన్నారు.
గోద్రా అల్లర్ల సమయంలో మీరు మోడీని ఎన్ని రీతులుగా ఇబ్బందులకు గురిచేశారో పార్టీలో ఎవరూ మర్చిపోలేదని స్పష్టం చేశారు. ఆనాడు బిజెపి పార్టీ నుండి మోడీని సస్పెండ్ చేయాలని కోరారు…. అదే జరిగి ఉంటే దేశానికి ఇంతమంచి ప్రధాని వచ్చేవారా? అంటూ చంద్రబాబుని ఎద్దేవా చేస్తూ సోము వీర్రాజు షాకింగ్ కామెంట్లు చేశారు. చంద్రబాబు తల్లకిందులుగా తపస్సు చేసినా ఎన్ని పొగిడినా మోడీ వినరు అంటూ క్లారిటీ ఇచ్చేశారు.