త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే గ్రేటర్ ఎన్నికలలో తిరిగి సత్తా చాటడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం రకరకాల వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఉంది. ముఖ్యంగా కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో పాటు కేటీఆర్ రాష్ట్రంలో కీలకంగా మారబోతునట్లు వార్తలు వస్తున్న తరుణంలో… ఈ ఎన్నికలను కేసీఆర్, కేటీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట.
ఇప్పటికే ఎన్నికలు జరిగే గ్రేటర్ ప్రాంతాలలో టిఆర్ఎస్ పార్టీ నేతలు తనదైన శైలిలో విస్తృతంగా పర్యటనలు చేపడుతున్నారు. పరిస్థితి ఇలా ఉండగా మరోపక్క టిఆర్ఎస్ పార్టీని ఈ గ్రేటర్ ఎన్నికల్లో దెబ్బకొట్టడానికి బీజేపీ అన్ని విధాల వ్యూహాలనూ సిద్ధం చేసినట్లు టాక్ వస్తోంది. ముఖ్యంగా అధ్యక్ష పదవి చేపట్టాక ఈ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారట. జరగబోయే ఎన్నికలలో అత్యధిక మెజార్టీ స్థానాలు గెలిచే బీజేపీ హైకమాండ్ కి తన నాయకత్వ దమ్మేంటో నిరూపించాలని అనుకుంటున్నారట.
దీంతో ముందుగా గ్రేటర్ హైదరాబాదులో అన్ని ప్రాంతాలలో బండి సంజయ్ పాదయాత్ర చేయబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇదే క్రమంలో వరంగల్ లో కూడా బండి సంజయ్ సరికొత్త వినూత్న కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కరోనా కంట్రోల్ చేసే విషయంలో మరియు ఇటీవల వర్షాలు భయంకరంగా పడటంతో చాలా చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో వీటిని విమర్శనాస్త్రాలుగా కేసీఆర్, కేటీఆర్ లపై ప్రయోగించడానికి బండి సంజయ్ మాస్టర్ మైండ్ స్ట్రాటజీ రెడీ చేసినట్లు తెలంగాణ బిజెపి పార్టీ వర్గాలలో వినబడుతున్న టాక్. ఈ దెబ్బతో ఎలాగైనా జరగబోయే గ్రేటర్ ఎలక్షన్ లో టిఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించాలని ఫుల్ గా డిసైడ్ అయ్యారట బండి సంజయ్.