జగన్ అధికారంలోకి వచ్చాక మాత్రమే కాక సమాజంలో కూడా మార్పులు వచ్చే రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వాలకు తన పరిపాలనకు చాలా వ్యత్యాసం కనబడేలాగా తనదైన మార్క్ ఆలోచనలతో ముందుకు దూసుకు పోతున్నా జగన్ విద్య మరియు వైద్య రంగాలలో సంచలన నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే. “నాడు నేడు” పేరిట పాఠశాలల్లో అదేవిధంగా హాస్పిటల్స్ లో మార్పులు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సమాజంలో ప్రతి పేదవాడు చదువుకి అదేవిధంగా విలువైన వైద్యానికి దూరం కాకూడదని.. ప్రభుత్వ ఆధీనంలో నడిచే స్కూల్స్ మరియు ఆసుపత్రిలలో మార్పులు చేపట్టిన జగన్ సర్కార్ తాజాగా రియల్ ఎస్టేట్ మాఫియా కు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనధికార అక్రమ లే అవుట్ల జాబితా ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. 34 వేల 167 ఎకరాల విస్తీర్ణంలో 6076 అక్రమ అనధికార లే అవుట్లు గుర్తించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో గుర్తించిన అక్రమ లేఅవుట్ల జాబితా గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో నోటీసు బోర్డులో పాటు రిజిస్టర్ ఆఫీసులకు ప్రభుత్వం జాబితాలు అందజేయటం జరిగినట్లు టాక్. దీంతో అనుమతులు లేని లేఅవుట్లలో ని ఫ్లాట్లను రిజిస్టర్ చేయొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగిందట. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో అక్రమ లేఅవుట్లు నెలకొనగా, అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో అనుమతులు లేని చోట్ల ఫ్లాట్ లను రిజిస్టర్ చేయకూడదని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం తో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మాఫియా కు చెక్ పెట్టినట్లు అయింది.