2019 ఎన్నికల దెబ్బకి కుదేలు అయిపోయిన టిడిపి కి రాజకీయంగా మళ్లీ రాష్ట్రంలో పుంజుకునే అవకాశం రాజధాని అమరావతి రూపంలో వచ్చినా చంద్రబాబు హైదరాబాద్ కె పరిమితము అన్నట్లుగా వ్యవహరించడం సొంత పార్టీలోనూ ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. కరోనా వైరస్ విషయంలో అదే రీతిలో విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ఘటన విషయం లో ప్రతిపక్ష పాత్ర పోషించి పొలిటికల్ మైలేజ్ సంపాదించు కోవలసిన సమయంలో చంద్రబాబు అప్పట్లో కూడా హైదరాబాద్ కే పరిమితమయ్యారు.
అప్పుడు సొంత పార్టీ క్యాడర్ నుండే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఏపీలో ప్రస్తుతం టిడిపి రాజకీయంగా చాలా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో అమరావతి ఉద్యమాన్ని నాయకుడిగా ముందుండి కొంత పుంతలు తొక్కీంచాల్సిన తరుణంలో…. రాజధానిని జగన్ ప్రభుత్వం తరలిస్తుంటే అధ్యక్షుడిగా ఏమి వ్యవహరించకుండా..హైదరాబాదులో ఉండి ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు పార్టీనుండి ఉత్పన్నమవుతున్నాయి.
పార్టీ క్లిష్టమైన టైం లో పొలిటికల్ గా మైలేజ్ సంపాదించుకునే అవకాశం ఉన్నా, సైలెంట్ గా చంద్రబాబు ఉండటం పై విమర్శలు వస్తున్నాయి. మాట్లాడితే హైదరాబాద్ నుండి జూమ్ యాప్ మీటింగ్ తప్పా, చంద్రబాబు ప్రతిపక్ష నేతగా మరోపక్క పార్టీ అధ్యక్షుడిగా కూడా రాణించలేక పోతున్నారనే విమర్శలు ఏపీలో గట్టిగానే వినబడుతున్నాయి.
ఈ విధంగానే వ్యవహరిస్తే 2024 ఎన్నికలకు ముందే ఏపీలో కూడా టీడీపీ దుకాణం సర్దేసుకోవటం గ్యారెంటీ అనే టాక్ సీనియర్ల నుండి వస్తోంది. పైగా చంద్రబాబు వయసు ఏడుపదులు కావటంతో.. ఈ టైంలో కాకపోతే ఇంకెప్పుడు మేల్కొంటారు అనే వాదన కూడా పార్టీ నుండి బలంగా వినబడుతోంది.