మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఏపీ ప్రభుత్వం పై సీరియస్ కామెంట్లు చేశారు. సీఎం జగన్ పరిపాలన తుగ్లక్ పరిపాలన నీ గుర్తు చేస్తుందని… ఇలాంటి ప్రభుత్వం ఎన్నో రోజులు నిలబడదని, కూలిపోవటం గ్యారెంటీ అని హెచ్చరించారు. ఇటీవల పోలీసులు అమరావతి రైతులను సంకెళ్ళు వేసి తీసుకెళ్లినందుకు గుంటూరులో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నక్కా ఆనందబాబు… మాట్లాడుతూ అధికారంలో ఉన్న వైసిపి పార్టీ అహంకారం పరాకాష్టకు చేరింది అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దళితుల కోసం తీసుకొచ్చిన అట్రాసిటీ వేధింపుల నిరోధక చట్టాన్ని మళ్లీ వారిపైన ప్రయోగిస్తారా అని ప్రశ్నించారు.
కేసు పెట్టిన వ్యక్తి ఫిర్యాదు వెనక్కి తీసుకున్న మళ్ళీ అతన్ని అరెస్టు చేయడం జగన్ పాలనలో మాత్రమే సాధ్యమని వెటకారంగా విమర్శించారు. వైసీపీ పార్టీకి గంపగుత్తగా ఓట్లు వేసిన దళితులపై జగన్ పగా తీర్చుకుంటున్నారని ఆరోపించారు. అసలు జగన్ కి దళితులు అంటే ఎందుకు అంత కోపం… ప్రతిపక్షంలో ఉన్న సమయంలో దళితులకు అండగా ఉంటామని కల్లబొల్లి మాటలు చెప్పి ఇప్పుడు దళితులనే చిన్నచూపు చూస్తూ… వారిని హింసిస్తున్నారని..ఈ పదిహేడు నెలల పరిపాలనలో ఇది సర్వసాధారణం అయిపోయింది, అన్నట్టు ఘాటుగా నక్కా ఆనందబాబు మండిపడ్డారు.
ఇదిలా ఉండగా నక్కా ఆనందబాబు చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ మద్దతుదారులు ఖండిస్తున్నారు. జగన్ కి దళితులపై గౌరవం ఉండబట్టే… కీలక మంత్రి శాఖలలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారిని కూర్చోబెట్టడం జరిగిందని కౌంటర్లు వేస్తున్నారు. అసలు దళితులుగా ఎవరు పుట్టాలని అనుకోరాని చంద్రబాబు.. వ్యాఖ్యలు చేశారు. అప్పుడు మాట్లాడని మీరు ఇప్పుడు దళితులు గురుంచి వారి బాగోగుల గురించి మాట్లాడటం వెటకారంగా ఉందని కౌంటర్లు వేస్తున్నారు.