ఢిల్లీ , మార్చి 7 : ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మొహిందర్ గోయల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
గత డిసెంబరులో పెన్షన్ మంజూరు కోసం తాను ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లినపుడు ఎంఎల్ఏ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపిస్తున్నది. ఈ సంఘటన జరిగిన నెల తరువాత ఎంఎల్ఏ కార్యాలయంలో గోయల్ మళ్లీ తనపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నదని పోలీసులు తెలిపారు.
ఎంఎల్ఏపై సెక్షన్ 376, 506, 509 కింద కేసులు నమోదు చేశారు.
మొహిందర్ గోయల్ రితాల నియోజకవర్గ ఎంఎల్ఏ.