Janasena Vs YSRCP: పవన్ కళ్యాణ్ చేస్తున్న రైతు భరోసా యాత్రతో రాష్ట్రంలో వైసీపీ – జనసేన మధ్య అగ్గి రాజుకుంటుంది.. పవన్ కళ్యాణ్ తాజాగా నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఘాటుగా మాట్లాడారు.. ఆ మాటలకూ ఈరోజు వైసీపీ నేతలు స్పందించారు. మంత్రి దాడిశెట్టి రాజా పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. తునిలో మంత్రి మాట్లాడుతూ.. “వైసీపీ పాలన లో రాష్ట్ర ప్రజలకు కష్టాలు లేవు.. పవన్, చంద్రబాబుకి మాత్రమే కష్టాలు ఉన్నాయి.. చంద్రబాబు కష్టాల్లో వున్నారు..ఆయన కన్నీళ్లు తుడవటానికే పవన్ బయటకు వస్తున్నారు.. వైసీపీ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారు. జనసేన కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు జై జగన్ అంటుంటే జగన్ మానియా చూసి పవన్ కి మతిపోయింది.. చంద్రబాబు అధికారం ఉన్నతసేపు రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు,దౌర్జన్యాలు,అక్రమాలు జరిగిన పవన్ కు కనపడవు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
చంద్రబాబు కష్టాల్లో ఉంటేనే పవన్ కు ఏపీలో లేని కష్టాలు కొత్తగా కన్పిస్తాయి.. వైయస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడమే కాకుండా, అంత కంటే ఎక్కువే రైతులకు చేస్తుంది.. ఈ రాష్ట్రంలో పవన్,చంద్రబాబు రెండు సిద్దాంతాలతో రాజకీయాలు చేస్తున్నారు.. ఒక్కరు ఏమో అమ్మే సిద్ధాంతాన్ని నమ్మితే.. ఇంకో నాయకుడు కొనే సిద్దాంతంతో రాజకీయాలు చేస్తున్నాడు. పార్టీ పెట్టి తనను నమ్ముకున్న వాళ్ళను అమ్మకానికి పెట్టడమే తన సిద్దాంతంగా పెట్టుకున్న నాయకుడు.. మంచి రేటు కోసం తాపత్రయ పడ్డుతున్నాడు.. అంటూ మండిపడ్డారు. అడ్వాన్స్ లు తీసుకుని తన రాజకీయ పార్టీని అద్దికి ఇచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్.. 2024 ఎన్నికలకు తన పార్టీ ని అద్దికి ఇవ్వటానికి మాటలు కూడా అయ్యిపోయాయి.. 2014లో అద్దెకు ఇచ్చిన పార్టీ.., 2024లో అద్దెకు సిద్దం అయింది” అంటూ దాడిశెట్టి రాజా ఫైర్ అయ్యారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Janasena Vs YSRCP: స్పీడ్ పెంచిన జనసేన..!
మరోవైపు జనసేన పార్టీ కూడా రాజకీయ స్పీడ్ పెంచింది వైసీపీ నేతలకు కౌంటర్లు ఇవ్వడంలో పవన్ ఒక్కడే కాకుండా ఆ పార్టీ మరో నేత నాదెళ్ల మనోహర్, నాగబాబు కూడా అడపాదడపా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర మరో నెలరోజుల పాటూ కొనసాగనుంది. వారంలో రెండు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. జిల్లాలో ఒక ప్రాంతానికి వెళ్లి.. ఆ జిల్లాలోని బాధిత రైతులు అందర్నీకి ఒక చోటకు చేర్చి తమ పార్టీ తరపున రూ. లక్ష సాయం అందిస్తున్నారు. ఈ వేదికపై రాజకీయంగా వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు..!