అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ జండా రంగు అన్ని చోట్ల దర్శనమిస్తున్నది. గ్రామ సచివాలయ భవనాలు, వాటర్ ట్యాంక్లు, పాఠశాలల ప్రహరీగోడలు, స్మశానవాటికలు ఇలా అనేక ప్రభుత్వ కట్టడాలకు వైసిపి జండా రంగులు వేశారు. ఈ వ్యవహారాన్ని ప్రతిపక్ష టిడిపితో సహా బిజెపి నాయకులూ విమర్శించారు. ఇప్పుడు తాజాగా రహదారి డివైడర్లకు వైసిపి జండా రంగు వేయడాన్ని టిడిపి ఎన్ఆర్ఐ విభాగం తప్పుబట్టింది. ఓ రహదారి డివైడర్కు వైసిపి జండా రంగు వేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ తదితరులకు ట్యాగ్ చేశారు. జగన్ ప్రభుత్వం తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ జాతీయ రహదారుల డివైడర్ రంగులను మార్చేస్తోందని పేర్కొన్నారు.
https://twitter.com/tdp_nri/status/1192482959212847104