కడప: టిడిపి అధినేత చంద్రబాబు జైలుకు పోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వైసిపి రాష్ట్ర కార్యదర్శి సి రామచంద్రయ్య అన్నారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్న పార్టీని ప్రవేట్ రాజ్యం అని ఆరోపించడం సిగ్గు చేటని అన్నారు. చట్టాన్ని చేతిలో పెట్టుకోని చంద్రబాబు పాలన చేశారని రామచంద్రయ్య విమర్శించారు. కోడేల దోపిడీపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నా వారికి సిగ్గు రాలేదని రామచంద్రయ్య దుయ్యబట్టారు. వ్యాపార లావాదేవీలు చక్కదిద్దుకునే సుజనా చౌదరి వైసిపిని విమర్శించడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని ప్రజలు తిరస్కరించినా చంద్రబాబులో మార్పు రాలేదని రామచంద్రయ్య వ్యాఖ్యానించారు.
కుట్రలు కుతంత్రాలతో బాబు రాజకీయాలు చేస్తున్నారనీ, అస్థిరతను సృష్టిస్తున్నారని రామచంద్రయ్య విమర్శించారు.గ్రామీణ ప్రాంతాల్లో సామరస్య వాతావరణాన్ని తీసుకురాలేని వ్యక్తి రాజకీయ వేత్త కాదని రామచంద్రయ్య అన్నారు. చంద్రబాబు సిద్ధాంతాలను వైసిపి ప్రభుత్వం కోనసాగించాల్సిన అవరం లేదని రామచంద్రయ్య పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలను చంద్రబాబు సర్వనాశం చేశారని రామచంద్రయ్య దుయ్యబట్టారు. వ్యవస్థలను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని రామచంద్రయ్య పేర్కొన్నారు.
నాటి చంద్రబాబు వంద రోజుల పాలన, నేటి జగన్ వంద రోజుల పాలనపై బేరీజు వేసుకోవాలని రామచంద్రయ్య సూచించారు.పిపిఎల పునః సమీక్ష, పోలవరం రీ టెండరింగ్ చేస్తే తప్పేమిటి, వారి అవినీతి అక్రమాలు భయటపడతాయని భయమా అని రామచంద్రయ్య ప్రశ్నించారు. బాబు అవినీతి పరిపాలనతోనే పెట్టుబడిదారులు భయపడి పరిగెత్తిపోయారని రామచంద్రయ్య అన్నారు. తప్పులు జరిగితే సరిద్దిద్దుకు పోవాలని చంద్రబాబు అంటారనీ, కానీ తప్పు చేస్తే నిలదీయమని జగన్ అంటారనీ దీన్ని బట్టి చూస్తే ఎవరి నిజాయితీగా పాలన అందిస్తున్నారో అర్థం అవుతుందని రామచంద్రయ్య అన్నారు. ఎన్నికల హామీలను విస్మరించి పాలన సాగించిన చంద్రబాబుకు వైసిపిని విమర్శించే హక్కు లేదని రామచంద్రయ్య స్పష్టం చేశారు. బాబు హయాంలో అనంతపురం జిల్లాలో రైన్ గన్స్ వ్యవస్థ తెచ్చి కోట్లు దోచుకున్నారని రామచంద్రయ్య ఆరోపించారు.