అమరావతి: వైసీపీ నాయకురాలు, ప్రముఖ సినీ నటి జయసుధ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుని వివాహానికి హాజరుకావాల్సిందిగా కోరారు. వివాహ ఆహ్వాన పత్రికను సీఎం వైఎస్ జగన్కు అందించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జయసుధ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబును కలసి కుమారుడి వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. జయసుధ ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ రాజకీయ పార్టీలోని దగ్గరి పరిచయస్తులను కలసి తన కుమారుడి వివాహ మహోత్సవానికి ఆహ్వానిస్తున్నారు.
previous post
next post
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?