అమరావతి: పరిపాలనా వికేంద్రీకరణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రతిపాదిస్తున్న మూడు రాజధానుల ప్రకటనను కేంద్ర మాజీ మంత్రి, మెగా స్టార్ చిరంజీవి స్వాగతించిన నేపథ్యంలో ఆయనకు వైసిపి విజయవాడ పార్లమెంటరీ ఇన్చార్జి, పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ హాట్సాఫ్ చెప్పారు.
అభివృద్ధి అనేది ఒకే ప్రాంతంలో జరిగితే నష్టాలను చిరంజీవి అర్థం చేసుకున్నారని పివిపి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా చిరుకు హాట్సాఫ్ చెబుతూ చిరు పత్రికా ప్రకటనను ట్యాగ్ చేశారు.
జై ఆంధ్రా ఉద్యమం తరువాత ఆంధ్రులు ఒక సారి మెసపోయారని పివిపి పేర్కొన్నారు. ఇంకోకసారి అటువంటి పరిస్థితి రాకూడదనే అన్ని ప్రాంతాలలో సమతుల్యమైన అభివృద్ధికి సిఎం జగన్ కృషి చేస్తున్నారని అన్నారు.