అమరావతి: తాను పార్టీ మారే ఆలోచన లేదని భీమవరం వైసిపి నాయకురాలు తోట వాణి స్పష్టం చేశారు. తోట వాణి వైసిపిని వీడి బిజెపిలో చేరనున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం దీనిపై వాణి వివరణ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు టిడిపి నుండి తోట నర్శింహం, వాణి దంపతులు వైసిపిలో చేరారు.
భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వాణి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి మాజీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఇటీవలే టిడిపి నుండి బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ద్వారా వాణి ఆ పార్టీలో చేరనున్నారని వార్తలు వచ్చాయి. ఈ ప్రచారాన్ని మంగళవారం ఆమె కొట్టి పారేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందని వాణి చెప్పారు.
టిడిపి అభ్యర్థిగా తనపై గెలిచిన చినరాజప్ప ఎన్నికను సవాల్ చేస్తూ వాణి ఇటీవల హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. తప్పుడు అఫిడవిట్తో ఎన్నికల సంఘాన్ని మోసం చేసినందుకు అయనను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్లో కోరారు.