KTR: పక్కనే ఉన్న రాష్ట్రంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. కరెంటు, నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ పరిణామంతో కేటీఆర్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ లు ఇచ్చారు. కేటీఆర్ నోటి దురుసు తగ్గించుకుంటే మంచిదని సూచించారు. తెలంగాణ ప్రజలు జగన్ మాకు ముఖ్యమంత్రి అయి ఉంటే బాగుండును అని అనుకుంటున్నట్లు తెలిపారు. బలహీన వర్గాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ రావాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కరోనా విచ్చలవిడిగా వ్యాపిస్తున్న సమయంలో చికిత్స కోసం తెలంగాణ ప్రజలు ఏపీకి వచ్చారని.. కేటీఆర్, కేసిఆర్ చెప్పే వనీ వట్టి మాటలే అని..పేర్ని నాని స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇచ్చారు. ఇక ఇదే సమయంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా కేటీఆర్ వ్యాఖ్యల పట్ల మండిపడ్డారు. ఏపీ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నేనూ విన్నాను. తనకు ఎవరో ఫ్రెండ్ చెప్పారని ఆయన అన్నారు. నిజానికి మంత్రి మెప్పు పొందడం కోసం ఆ ఫ్రెండ్ కావాలనే అలా చెప్పాడని అనుకుంటున్నాం. లేదా ఆ వ్యక్తి మా పార్టీకి వ్యతిరేకం అయి ఉండొచ్చు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇవాళ ఇక్కడ నీరు పుష్కలంగా ఉంది. ఎక్కడా లోటు లేదు. పెద్ద ఎత్తున రోడ్ల మరమ్మతు పనులు చేస్తున్నాం. నా జిల్లాలోనే రూ.200 కోట్లతో రోడ్ల మరమ్మతులు చేస్తున్నాం. వేసవిలో పనులు వేగంగా జరుగుతున్నాయి. తెలంగాణ గురించి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. ఉదాహరణకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామన్నారు. కానీ ఇచ్చారా? కానీ ఈ రాష్ట్రంలో అంతా మంచి జరుగుతోంది. కేటీఆర్ మాట్లాడినంత మాత్రాన మాకు వచ్చే నష్టమేమీ లేదు. సీఎం వైయస్ జగన్ దేశమంతా మంచి పేరు తెచ్చుకున్నారు. కాబట్టి ఆయనను ఒక మాట అంటే తనకు ప్రచారం వచ్చి, ఎదగొచ్చని తెలంగాణ మంత్రి అనుకున్నారేమో?. అంటూ వ్యంగ్యంగా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఏది ఏమైనా ఏపీలో మౌలిక సదుపాయాల విషయంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.