పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైకాపా ఎంపీ రఘురామ కృష్ణంరాజును సస్పెండ్ చేయించేందుకు వైకాపా నేతలు పావులు కదుపుతున్నారు. ఈరోజు స్పెషల్ ఫ్లైట్ లో విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ నేతలు ఢిల్లీ వెళ్లి లోక్ సభ స్పీకర్ ను కలిసిన విషయం తెల్సిందే.
దానికి సంబంధించి విజయసాయి రెడ్డి మాట్లాడుతూ లోక్ సభ స్పీకర్ ను కలిసి ఆర్టికల్ 2 ప్రకారం రఘురామ కృష్ణంరాజుపై సస్పెన్షన్ వేటు వేయాలని కోరినట్లు తెలిపారు. ఇంతకు ముందు రఘురామ కృష్ణంరాజు పార్టీ నుండి తన సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. తాను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలకు పాల్పడలేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశముంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?