ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం దేవాలయాల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న క్రమంలో ఏపీ ప్రతిపక్షాలు వైసిపి పార్టీ పై విమర్శలు చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చంద్రబాబుపై ఆయన కుమారుడు నారా లోకేష్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో దేవాలయాలను కూల్చేయడం జరిగింది అని చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా దేవాలయాలకు బూతులు వేసుకునే పూజలు చేసిన ఘనత చంద్రబాబుకి చెల్లుతుంది అంటూ ఆయన పై సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు వైసీపీ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తుందనే ఈర్ష్యతో చంద్రబాబు.. అండ్ కో కుట్రలకు పాల్పడుతున్నారని వెల్లంపల్లి మండిపడ్డారు.
అదే విధంగా తిరుమలలో వెయ్యి స్తంభాల మండపాన్ని ఈ చంద్రబాభే కూల్చేయడం జరిగిందని..అటువంటి ఈ వ్యక్తి రామతీర్థంకు వెళ్లి మొసలి కన్నీరు కారుస్తున్నారని చెప్పారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా జైలు భయంతోనే చంద్రబాబు భయంభయంగా.. ప్రవర్తిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రశాంతంగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతాల మధ్య చంద్రబాబు గొడవలు పెడుతున్నాడని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఇలానే వ్యవహరిస్తే అసెంబ్లీలో మాత్రమే కాక సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా గెలిచే పరిస్థితి ఉండదని ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని చంద్రబాబుపై వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు.
అంతేకాకుండా మరికొంత మంది వైసీపీ నేతలు అప్పట్లో అధికారంలో ఉన్న సమయంలో ఓటుకు నోటు కేసు విషయంలో దొరికిపోయిన సమయంలో..ప్రాంతాలవారీగా ప్రజలను రెచ్చగొట్టారని చంద్రబాబుపై మండిపడ్డారు. అయితే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండటంతో మతాల మధ్య చిచ్చు పెట్టి ఓటుకు నోటు కేసు నుండి బయటపడటానికి ప్రజల మనోభావాలతో టిడిపి చెలగాటమాడుతోంది అంటూ వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు ..బాబు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేస్తున్నారు.