అనంతపురం: ‘కంటి వెలుగు’ పథకం ప్రారంభం సందర్భంగా ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికే జాబితాలో తన పేరు లేకపోవడంతో తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి మనస్తాపం చెందారు. ‘కంటి వెలుగు’ పథకం ప్రారంభించేందుకు ఈరోజు అనంతపురం జిల్లాలో సీఎం జగన్ పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి అనంతపురం విచ్చేస్తున్న జగన్కు హెలిప్యాడ్ వద్ద మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి స్వాగతం పలికారు. ఈ జాబితాలో తన పేరు లేకపోవడంపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరును ఎందుకు చేర్చలేదని మంత్రి శంకరనారాయణను నిలదీశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.
previous post
next post
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?