అమరావతి: మహిళల భద్రత అంశంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో వైసిపి ఎమ్మెల్యే ఆర్కె రోజా..జనసేన అధినేత పవన్ పేరు ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయి చరిత్రలో నిలిచిన నాయకుడు రేప్ చేసిన వారికి రెండు బెత్తం దెబ్బలు సరిపోతాయ్ అంటూ వ్యాఖ్యానించారని రోజా అన్నారు. గతంలో తన సోదరిని ఎవరో ఏదో అన్నారని రివాల్వర్ పట్టుకొని రోడ్డుపైకి వచ్చారన్న విషయాన్ని రోజా గుర్తు చేశారు. రోజా మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం కలుగజేసుకున్నారు. సభలో లేని వ్యక్తులపై మాట్లాడవద్దని రోజాకు సూచించారు.
previous post
next post