NewsOrbit
ట్రెండింగ్ రాజ‌కీయాలు

జగన్ మంత్రాలు వింటే షాకవ్వాల్సిందే అంటున్న వైసీపీ ఎమ్మెల్యే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా డిక్లరేషన్ వివాదం గురించి భారీగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ నేతలు డిక్లరేషన్ కోసం పట్టుబట్టగా జగన్ మాత్రం డిక్లరేషన్ పై సంతకం చేయకుండానే తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లారు. తిరుమల దర్శనానికి జగన్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు.

 

తాజాగా శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ మంత్రాలు వింటే షాక్ అవ్వాల్సిందేనని చెప్పారు. జగన్ ఆహార్యం చూస్తే అందరూ బ్రాహ్మణుడి పుత్రుడు అనుకున్నారని.. ఆయన మంత్రాలు చదువుతుంటే అందరూ ఆశ్చర్యపోయారని చెప్పారు. హిందువునే అయినప్పటికీ తనకు మంత్రాలు చదవటం రాదని ఎమ్మెల్యే వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మతాన్ని అడ్డం పెట్టుకుని వివాదాలు సృష్టిస్తున్నారని అన్నారు.

చంద్రబాబు ఇలా మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదని చెప్పారు. చంద్రబాబు గారు షూ విప్పి పూజించడం నేర్చుకోవాలని.. జగన్ గారు నామం పెట్టుకున్నా వివాదం సృష్టిస్తారని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎన్నికల్లో ఓటమిపాలు కాగానే హైదరాబాద్ కు వెళ్లిపోయారని విమర్శలు చేశారు. చంద్రబాబు హైదరాబాద్ లో ఉండకుండా రాష్ట్రానికి వచ్చి ప్రజలకు సేవ చేయాలని కోరారు.

కరోనా లాక్ డౌన్ కాస్తా అన్ లాక్ అయిన తరువాతైనా చంద్రబాబు రాష్ట్రానికి వస్తే బాగుంటుందని హితవు పలికారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?