ఏపీ హోంమంత్రి గుంటూరు జిల్లాకే చెందిన వారైనప్పటికీ ఆ జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు పోలీసుల మీద కస్సుబుస్సు లాడుతున్నారు.అడ్డుఅదుపూ లేకుండా వారు ఖాకీలపై నోరు పారేసుకుంటున్నారు.ఈ మధ్య తాడికొండ వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఒక పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ ని ఏ విధంగా బెదిరించిందో స్పష్టంగా తెలియజేసే ఆడియో టేప్ లీక్ కావడం విదితమే.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇసుకను అక్రమ రవాణా చేసే వాహనాలను పట్టుకున్న తాడికొండ సిఐకి ఎమ్మెల్యే శ్రీదేవి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.ఇసుక అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ తన మనుషులు వాహనాలను వెంటనే విడుదల చేయాలని ఆమె సిఐని ఆదేశించగా అది కుదరదన్నట్లు సమాధానం చెప్పిన సర్కిల్ స్పెక్టర్ పై ఆమె చెలరేగిపోయారు.నీకేమైనా మెంటలా అని ప్రశ్నించారు!మీరు చెప్పిన పని చేస్తానని నా కాళ్లు పట్టుకొని తాడికొండలో పోస్టింగ్ ఇప్పించుకున్నావని కూడా సిఐకి గుర్తు చేశారు.తాను తలుచుకుంటే నిమిషంలో ఇక్కడ నుంచి ఎగిరి పోతావని ఆమె సిఐని హెచ్చరించారు.ఈ సంఘటన ఇంకా మరుగున పడకముందే గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పోలీసులపై నోరు జారారు.
‘ఏ౦ది బొంగు లో పోలీసులు ”అంటూ ఆయన వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.విషయానికొస్తే గురజాల టిడిపి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఇటీవల నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా వైసిపి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పోలీసులు తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. మళ్లీ టిడిపి అధికారం లోకొచ్చినప్పుడు తాము కూడా ఇలాగా కేసులు పెట్టిస్తామంటూ యరపతినేని హెచ్చరించారు.ఈ విషయాన్ని మీడియా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చి ఆయన స్పందన కోరగా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. నా బొంగులో పోలీసులు యరపతినేని మాజీ అయిపోగానే పోలీస్ అధికారులు నా కాళ్లు పట్టుకుని మరీ పోస్టింగులు తెప్పించుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఇలా అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఒకరేమో నీకు మెంటలా అని మరొకరేమో నా బొంగులో అని వ్యాఖ్యానిస్తుండడంతో పోలీసులు ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారు.ఇప్పటికైనా హోంమంత్రి స్పందిస్తే బాగుంటుందని ఒక పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.అయితే హోంమంత్రికి వైసీపీ ఎమ్మెల్యేలకు చెప్పేంత సీనుందా అన్నదే అనుమానం!ఏం జరుగుతుందో చూడాలి_
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?